జ్ఞానవాపి మసీదు వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన ఇదే

సంబంధిత బావిని సీజ్ చేసి కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘‘సంబంధిత ప్రాంతాన్ని..

Update: 2022-05-16 13:43 GMT

కోర్టు ఆదేశాల మేరకు కాశీలోని విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ప్రముఖ జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ మధ్య విచారణ పూర్తి చేశారు. తొలుత వీడియోలు తీసేందుకు, మసీదు ఆవరణ లోపలకు వచ్చేందుకు మసీదు నిర్వహణ కమిటీ అనుమతించలేదు. దీంతో కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో, గట్టి బందోబస్తు మధ్య శనివారం నుంచి సోమవారం వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కోర్టు నియమించిన కమిషనర్, న్యాయవాదుల బృందం ఈ పనిని పూర్తి చేసింది. మసీదు లోపలి బావిలో శివలింగాన్ని కనుగొన్నట్టు న్యాయవాది విష్ణు జైన్ ప్రకటించారు. సర్వేలో పాలు పంచుకున్న న్యాయవాద బృందంలో ఒకరు విష్ణు జైన్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంబంధిత బావిని సీజ్ చేసి కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ''సంబంధిత ప్రాంతాన్ని సీజ్ చేయండి. ఏ ఒక్కరినీ అనుమతించొద్దు'' అంటూ జిల్లా కలెక్టర్ కౌషల్ రాజ్ శర్మను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అనుసరిస్తామని మసీదు నిర్వహణ కమిటీ జాయింట్ సెక్రటరీ యాసిన్ ప్రకటించారు. పిటిషనర్లతో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులు ప్రకటనలు చేస్తుండడం, సర్వే వివరాలను లీక్ చేస్తుండడం ఎంతో బాధకు గురిచేస్తోందని యాసీస్ పేర్కొన్నారు.

ఈ ఉదంతంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సోమవారం అన్నారు. మసీదు ఎప్పటికీ ఉంటుందని అన్నారు. దేశంలోని ముస్లింలు బాబ్రీ మసీదును కోల్పోయారని, అయితే వారు మరో మసీదును కోల్పోయే స్థితిలో లేరని చెప్పారు. వీడియోకు క్యాప్షన్ ఇస్తూ "జ్ఞాన వాపి మస్జిద్, మస్జిద్ థీ, ఔర్ ఖయామత్ తక్ రహేగీ ఇన్షా అల్లా (జ్ఞాన వాపి మస్జిద్ ఉండేది.. ఎప్పటికీ ఉంటుంది)" అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని.. సుప్రీం కోర్టు ఆజ్ఞలను అసలు పాటించడం లేదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఘటనలు ఇలాంటివి మరిన్ని జరుగుతాయని అన్నారు.
కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్నదానిని జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్ గా పిలుస్తారు. ఇందులోనే మసీదు కూడా ఉంది. ఈ కాంప్లెక్స్ పశ్చిమాన హిందూ ఆలయాన్ని ధ్వసం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ రోజువారీ ప్రార్థనలకు అనుమతించాలని, హిందూ దేవతల ఆనవాళ్లను తేల్చాలని కోరుతూ కొందరు మహిళలు వారణాసి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ సర్వే జరిగింది.


Tags:    

Similar News