మూడు చట్టాలు రద్దు.. మంత్రి వర్గం నిర్ణయం

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.

Update: 2021-11-24 08:20 GMT

ప్రధాని మోదీ చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం మంత్రి వర్గం సమావేశమయింది. ఈ సమావేశంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల ప్రకటన....
ఇటీవల మోదీ మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా మంత్రివర్గం కూడా ఈ చట్టాల రద్దును ఆమోదించింది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను రద్దుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. మొత్తం మీద మోదీ చెప్పినట్లుగానే మంత్రి వర్గ సమావేశంలో చట్టాలను రద్దు చేశారు.


Tags:    

Similar News