Sabarimala : శబరిమలలో వారికి ఇక అనుమతి లేదు

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-03-16 02:56 GMT

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఇకపై పది నుంచి యాభై ఏళ్లలోపు మహిళలకు ప్రవేశం లేదని తెలిపింది. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది.

మంత్రివర్గంలో నిర్ణయం...
కేరళమంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిర్ణయంపై కేరళ సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.


Tags:    

Similar News