రైలు తనమీది నుంచి వెళ్లినా చలించని యువతి.. తీరిగ్గా పట్టాలపై కూర్చుని..

కొంతసేపటి వరకూ మాటపలుకు లేకుండా.. షాక్ లో ఉంటారు కదూ. కానీ ఈ యువతి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

Update: 2022-04-16 06:13 GMT

విజయవాడ : అనుకోకుండా రైలు మీద నుంచి వెళ్లి.. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడితే ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి. కొంతసేపటి వరకూ మాటపలుకు లేకుండా.. షాక్ లో ఉంటారు కదూ. కానీ ఈ యువతి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆమెపై నుంచి గూడ్సు రైలు వెళ్లిపోగా, క్షేమంగా బయటపడింది. కానీ.. కంగారుపడి పైకి వచ్చేయలేదు. లేచి పట్టాలపైనే కూర్చుని సెల్ఫోన్ తీసి కాల్ మాట్లాడుతూ ఉంది. ఆ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్లు కాబ్రా ట్విట్టర్లో ఏప్రిల్ 12న పోస్ట్ చేయగా.. వైరల్ అయింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం తెలుపలేదు.

'ఫోన్లో కబుర్లు చెప్పుకోవడం ఎంతో ముఖ్యం'' అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. పట్టాల నుంచి నింపాదిగా స్టేషన్ లోకి వచ్చిన యువతి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదంతా ఎవరో చక్కగా వీడియో తీసి పది మందికి జాగ్రత్తలపై స్పృహ కలిగేలా చొరవ చూపారు. 'అదృష్టంతో ఆమె శరీర భాగాలు ఏవీ రైలుకు తాకలేదు. లేదంటే ముక్కలయ్యేది'అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. ఆ యువతిని అరెస్ట్ చేయాలని కోరుతూ కొందరు ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేశారు.


Tags:    

Similar News