చంద్రగ్రహణం మర్నాటి నుండి ఆ ఇంట్లో రోజూ మంటలే.. కారణం ఏంటో తెలియక..

విద్యుత్ కనెక్షన్ లేకుండా కూలర్‌ నుంచి మంటలు రావడం, బీరువాలోని దుస్తులు కాలిపోవడంతో భయంతో బిక్కుబిక్కుమని గడిపారు.

Update: 2022-11-18 04:54 GMT

lunar eclipse effect

చంద్రగ్రహణం తర్వాతి నుండి ఆ ఇంట్లో ప్రతిరోజూ మంటలు చెలరేగుతున్నాయి. కారణమేంటో తెలియక ఇల్లు మారారు. అక్కడ కూడా అదే పరిస్థితి మిస్టరీగా మారిన ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో జరిగింది. ఈ నెల 8న చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాతి నుంచి ఇంట్లో ప్రతి రోజూ రాత్రి మంటలు అంటుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరుగుతుందేమోనని విద్యుత్ కనెక్షన్ తీయించారు. ఆ తర్వాతి రోజు కూడా ఇంట్లోని ఎలక్ట్రిక్ బోర్డులు, వైర్లు కాలిపోతుండడంతో వారి భయం మరింత పెరిగింది.

విద్యుత్ కనెక్షన్ లేకుండా కూలర్‌ నుంచి మంటలు రావడం, బీరువాలోని దుస్తులు కాలిపోవడంతో భయంతో బిక్కుబిక్కుమని గడిపారు. ఇంట్లో ఎర్తింగ్ సమస్య ఉందేమోనని విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి ఎర్తింగ్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమల్ పాండే అనే వ్యక్తికి స్థానిక మార్కెట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమీపంలో రెండంతస్తుల ఇల్లు ఉంది. అందులో కమల్ తమ్ముడు సహా 9 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. 8న చంద్రగ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంట్లోని విద్యుత్ బోర్డుల్లో మంటలు చెలరేగాయి.
వెంటనే మంటల్ని ఆర్పివేసి.. రెండంతస్తుల ఇల్లు ఉంది. అందులో కమల్ తమ్ముడు సహా 9 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. ఆ తర్వాతి రోజు టాయిలెట్లోని ఎలక్ట్రిక్ బోర్డులో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత పూర్తిగా విద్యుత్ కనెక్షన్‌ను పూర్తిగా తొలగించారు. విచిత్రంగా ఆ తర్వాత కూడా కూలర్‌లో మంటలు చెలరేగాయి. బీరువాలోని దుస్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడిపోయిన కమల్ కుంటుంబం తమ ఇంటి ముందున్న ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడికి మకాం మార్చారు. ఇంటి వద్ద కాపలాగా ఇద్దరు సోదరులు ఇంటి వెలుపల నిద్రించేవారు. అక్కడ కూడా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యారు.
విషయం తెలిసిన సిటీ మేజిస్ట్రేట్ రిచా సింగ్ పోలీసులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. మంగళవారం చివరిసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. బుధవారం నుంచి మంటలు కనిపించలేదు. ఇంట్లో పదేపదే మంటలు చెలరేగుతుండడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని రిచా సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. భూకంపం కారణంగా భూమి లోపల ఉండే వాయువుల లీకేజీ కారణంగా ఇలా జరుగుతుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాజస్థాన్‌లోని జలోర్, యూపీలోని కస్గంజ్, ఖుషీనగర్‌లలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.


Tags:    

Similar News