వంద రోజులకు చేరుకున్న జోడో యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటికి వందోరోజుకు చేరుకుంది. రాజస్థాన్ లో ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది

Update: 2022-12-16 03:29 GMT

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేటికి వందోరోజుకు చేరుకుంది. రాజస్థాన్ లో ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. రాహుల్ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తుంది. సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.

24న ఢిల్లీకి...
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లు మీదుగా రాజస్థాన్ కు చేరుకుంది. వంద రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర ఈ నెల 24న ఢిల్లీకి చేరుకోనుంది. అన్ని రాష్ట్రాల్లో రాహుల్ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


Tags:    

Similar News