నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కోవిడ్ పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు

Update: 2022-01-13 02:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కోవిడ్ పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, ఆ యా రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై ప్రధాని మోదీ అడిగి తెలుసుకోనున్నారు. భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఒమిక్రాన్ కూడా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపించింది. రోజుకు దాదాపు రెండు లక్షల కేసులు నమోదవుతున్నాయి.

కోవిడ్ పరిస్థితులపై....
ఈ నేపథ్యంలో ప్రధాని ముఖ్యమంత్రులతో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు పెడుతున్నారు. దీంతో ఈరోజు ప్రధాని మోదీ సమావేశంలో కోవిడ్ నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags:    

Similar News