రేపు మోదీ సీఎంలతో భేటీ...కఠిన ఆంక్షల దిశగా?

ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు

Update: 2022-01-12 02:35 GMT

ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ప్రధానంగా దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు విధించాయి. దీనిపై మోదీ సమీక్ష చేయనున్నారు. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

కరోనా కేసులతో.....

ఈ నేపథ్యంలో మోదీ రేపటి ముఖ్యమంత్రుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ లో రోజుకు లక్షన్నరకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ప్రారంభమయినట్లేనని నిపుణులు సయితం చెబుతున్నారు. దీంతో మోదీ కఠిన ఆంక్షల దిశగా ముఖ్యమంత్రులకు డైరెక్షన్ ఇచ్చే అవకాశముంది.


Tags:    

Similar News