Lalu comments on Modi:ప్రధాని మోదీ హిందువు కాదంటూ

ప్రధాని మోదీ హిందువు కాదంటూ సంచలన వ్యాఖ్యలు

Update: 2024-03-04 08:21 GMT

Lalu comments on Modi:ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు. పాట్నా లోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అసలు హిందువే కాదని అన్నారు. ప్రధాని మోదీ హిందువు కాదని, ఆయన తల్లి మరణిస్తే గుండు కొట్టించుకోలేదని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలను ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిస్తూ ఉంటారని.. అయితే మోదీకి కుటుంబమే లేదని ఎద్దేవా చేశారు. తల్లి మరణిస్తే హిందువులెవరైనా గుండు చేయించుకుంటారని.. కానీ ప్రధాని మోదీ అలా చేయలేదన్నారు. మోదీ ఎందుకు గుండు చేయించుకోలేదో చెప్పాలని లాలూ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు కుటుంబం లేదు, ఎందుకంటే మోదీ హిందువు కాదని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు అబద్ధాలు చెప్పడం, అందర్నీ మోసం చేయడం మాత్రమే వచ్చని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అనారోగ్యంతో 2022, డిసెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన తల్లి అంతిమ యాత్ర ఎటువంటి హడావుడి లేకుండానే సాగింది. మార్చురీ వ్యాన్‌‌లో హీరాబెన్ పార్థివ దేహం ఉంచగా.. శ్మశానం దాకా అందులోనే ప్రధాని మోదీ ప్రయాణించారు. తన సోదరులతో కలిసి పాడె మోశారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే మోదీ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆయన ఆరోజు గుండు కొట్టించుకోలేదు.


Tags:    

Similar News