బ్రేకింగ్ : మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్ కేసులు

భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం పన్నెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

Update: 2021-12-05 13:34 GMT

భారత్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం పన్నెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో మొత్తం ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఎనిమిది కేసులు నమోదయినట్లయింది. కర్ణాటకలో రెండు, గుజరాత్ లో ఒకటి, ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో మొత్తం కేసులు పన్నెండుకు చేరుకున్నాయి.

కేంద్రం అలెర్ట్....
భారత్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఒమిక్రాన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ చేసింది. కోవిడ్ ఆంక్షలను విధించాలని కోరుతోంది.


Tags:    

Similar News