భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. కొత్తగా 378 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

Update: 2022-01-06 04:55 GMT

భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. కొత్తగా 378 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,658కి చేరుకుంది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 797, ఢిల్లీలో 465 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ గత కొద్దిరోజులుగా వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది.

రాష్ట్రాలు అప్రమత్తం....
ిఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటు ఆంక్షలు విధించాయి. ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ ను కూడా విధించారు. తమిళనాడు కూడా అదే బాట పట్టింది. నైట్ కర్ఫ్యూలు అనేక రాష్ట్రాలలో అమలవుతున్నాయి. థియేటర్లు, మాల్స్ లో కూడా ఆంక్షలు విధించారు.


Tags:    

Similar News