షిండేకు సుప్రీంలో ఊరట

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు ఊరట లభించింది.

Update: 2022-07-11 06:03 GMT

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు ఊరట లభించింది. 16 మంది శివసేన ఎమ్యెల్యేల అనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించింది. ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, తర్వాత విచారణ చేపడతామని సుప్రీకోర్టు తెలిపింది.

అనర్హత ఎమ్మెల్యేలపై...
డిప్యూటీ స్పీకర్ అనర్హత ఎందుకు వేయకూడదంటూ శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 16 మంది పై ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. అయితే ఇంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోరుతూ పిటీషన్ ను వాయిదా వేసింది.


Tags:    

Similar News