కేరళను ఊపేస్తున్న కోవిడ్.. ఒక్కరోజులోనే

దేశంలో ఒమిక్రాన్ కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. కేరళలో ఒక్కరోజే 49,771 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2022-01-27 03:51 GMT

దేశంలో ఒమిక్రాన్ కేసులతో పాటు మరణాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. కేరళలో ఒక్కరోజే 49,771 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 140 మంది మరణించారు. అలాగే కర్ణాటకలో సయితం కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కర్ణాటకలో ఒక్కరోజులోనే 48,905 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ కేసులు.....
ప్రస్తుతం నమోదయ్యే ఎక్కువ కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. అయితే భయపడాల్సిన పనిలేదని, వైద్యుల సూచన మేరకు నడుచుకుంటే చాలని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నా వివిధ ఆరోగ్య కారణాలతో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది.


Tags:    

Similar News