అయోధ్యలో భారీ రావణాసురుడి విగ్రహం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్‌ పార్కు సిద్ధమవుతూ ఉంది.

Update: 2025-11-10 14:40 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్‌ పార్కు సిద్ధమవుతూ ఉంది. ఇక్కడ భారీ రావణాసురుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. 25 అడుగుల రావణాసురుడి విగ్రహం ఇక్కడ ఉండనుంది. పురాణ కాలంలో రామ, రావణుల మధ్య జరిగిన యుద్ధాన్ని తలపించేలా ఈ విగ్రహం ఉండనుంది. గుప్తార్‌ ఘాట్‌కు సమీపంలో తీర్చిదిద్దుతున్న ఈ పార్కులో రామాయణంలోని కీలక ఘట్టాలను కళ్లకు కట్టేలా పలు భారీ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు అయోధ్య మేయర్‌ తెలిపారు. సీతారాములు, లక్ష్మణుడి విగ్రహాలతో రూపొందిస్తున్న ‘రామ్‌దర్బార్‌’ అద్భుత ఆకర్షణగా నిలవనుంది.

Tags:    

Similar News