Kejrival : నేడు కోర్టుకు కేజ్రీవాల్.. కస్డడీ ముగియడంతో?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు

Update: 2024-03-28 05:34 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయన ఈడీ కస్డడీ నేటితో ముగియనుండటంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా ఆయనకు ఆరు రోజులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కస్టడీకి అప్పగించింది.

ఏం చెబుతారన్నది...
ఆరు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో మరొకసారి కస్టడీని పొడిగించాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరనున్నారు. ఇంకా విచారించాల్సిన విషయాలు ఉన్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు న్యాయస్థానంలో లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎక్కడకు చేరాయని, ఈ కేసులో నిజాలను కోర్టుకు కేజ్రీవాల్ వెల్లడించనున్నారని నిన్న ఆయన సతీమణి సునీత తెలపడంతో కొంత ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News