ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోఆరు కోట్లు విలువచేసే డైమండ్ నెక్లెస్ స్వాధీనం

అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు

Update: 2025-02-17 03:29 GMT

అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రయాణికుడు ఈ నెక్లెస్ తరలిస్తుండగా ఢిల్లీ విమానాశ్రయం అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు ఆరు కోట్ల విలువ చేసే నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కస్టమ్స్‌ విభాగం అధికారులు ఆదివారం ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

బ్యాంకాంక్ నుంచి...
ఈ నెల 12వ తేదీనన బ్యాంకాక్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నఒక ప్రయాణికుడిని తనిఖీ చేసినప్పుడు నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వజ్రాలు పొదిగి ఉన్న 40 గ్రాముల ఈ నెక్లెస్‌ విలువ రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. . నిందితుడిని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News