భారత్ లో స్థిరంగా కరోనా

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు నుంచి మూడు వేల లోపు కేసులు నమోదవుతున్నాయి.

Update: 2022-10-20 04:55 GMT

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు నుంచి మూడు వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు దేశంలో పలు ప్రాంతాల్లో వెలుగు చూడటం కొంత ఆందోళనకు గురి చేస్తుంది. మహారాష్ట్రాలో ఇటువంటి వేరియంట్లు కనిపించాయి. ఒక్కరోజులో 2,51,515 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 2,141 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారాణ అయింది. కరోనా కారణంగా ఇరవై మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మరణాల సంఖ్య....
భారత్ లో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ రికవరీ రేటు శాతం 98.76 శాతంగా నమోదయింది. దేశంలో ఇప్పటి వరకూ 5,28, 943 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల శాతం 0.06 శాతంగా నమోదయిందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 25,510 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 29.46 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News