భారత్ లో నేడు స్వల్పంగా పెరిగిన కేసులు

భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 9,283 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Update: 2021-11-24 04:42 GMT

భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 9,283 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 370 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,22,037 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,11,481 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

కేరళలో అత్యధికంగా....
భారత్ లో ఇప్పటి వరకూ 3,45,46,749 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,66,584 మంది మరణించారు. కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేరళలోనే నేడు 4,972 కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News