భారత్ లో పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 8,954 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 8,954 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 267 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,40,08,183 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 99,023 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,45,72,523 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,69,247 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,24,25, 02,767 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.