భారత్ లో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 211 మంది మరణించారు

Update: 2021-12-06 04:28 GMT

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 211 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,40,69,608 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 98,416 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరణాల సంఖ్య...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,41,561 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,73,537 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,27,61,83,065 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News