గుడ్ న్యూస్.... భారత్ లో బాగా తగ్గిన కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 6,990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 190 మంది మరణించారు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 6,990 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 190 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,40,08,183 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,00,543 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,45,72,523 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,68,980 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,23,25, 02,767 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.