భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 8,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 195 మంది మరణించారు.
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 8,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 195 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,40,89,137 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 93,733 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
వ్యాక్సినేషన్...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,48,383 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 473,952 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,29,76,10,590 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.