భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 7,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 343 మంది మరణించారు

Update: 2021-12-16 08:18 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 7,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 343 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,54,879 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 87,245 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

యాక్టివ్ కేసులు..
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,74,744 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,76,478 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,35,25,36,986 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News