భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు ఆందోళన కల్గిస్తున్నా, కరోనా తగ్గుతుండటం ఊరటనిస్తుంది

Update: 2021-12-18 07:57 GMT

భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు ఒకింత ఆందోళన కల్గిస్తున్నా, కరోనా కేసులు తగ్గుతుండటం ఊరటనిస్తుంది. ఈరోజు కొత్తగా 7,145 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 289 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,54,879 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 84,565 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరణాల సంఖ్య..
భారత్ లో ఇప్పటి వరకూ 3,47,26,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,77,158 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,36,99,96,267 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News