భారత్ లో పెరుగుతున్న యాక్టివ్ కేసులు

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 159 మంది మరణించారు

Update: 2021-12-09 04:37 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 9,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 159 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,89,137 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 94,742 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

వ్యాక్సినేషన్...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,66,241 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,74,111 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 3,46,66,241కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News