భారత్ లో పెరుగుతున్న కరోనా.. మరణాలు కూడా?

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 10,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Update: 2021-11-26 04:38 GMT

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 10,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 488 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,22,037 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,10,133 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

వ్యాక్సినేషన్....
భారత్ లో ఇప్పటి వరకూ3,45,44,882 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,67,468 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,20,38,44,741 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.


Tags:    

Similar News