నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా

ధరల పెంపుదలకు నిరసనగా ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నేడు కాంగ్రెస్ ధర్నా చేయనుంది

Update: 2022-09-04 04:09 GMT

ధరల పెంపుదలకు నిరసనగా ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నేడు కాంగ్రెస్ ధర్నా చేయనుంది. నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోలు, గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఈ ధర్నాకు దిగనుంది. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి క్షీణించిపోవడం తదితర అంశాలపై ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

ధరల పెరుగుదలకు....
ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలు కూడా పాల్గొంటున్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తరలి వెళ్లారు. ధర్నాలో పాల్గొనడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రశ్నించనున్నారు.


Tags:    

Similar News