121 రోజుకు చేరిన రాహుల్ యాత్ర

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతుంది.

Update: 2023-01-16 03:59 GMT

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతుంది. పంజాబ్ లోని లూథియానాలో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు నేటికి 121వ రోజుకు చేరుకుంది. జలంధర్ నుంచి హోషియార్పూర్ వరకూ నేడు పాదయాత్ర సాగనుంది.

జనం పెద్ద సంఖ్యలో...
రాహుల్ పాదయాత్ర గత ఏడాది సెప్టంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల మీదుగా ఢిల్లీ, హర్యానాల నుంచి పంజాబ్ కు చేరుకుంది. రాహుల్ పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.


Tags:    

Similar News