కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఆ వెబ్ సైట్ లపై నిషేధం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వెబ్ సైట్ లపై నిషేధాన్ని పెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న 242 బెట్టింగ్ వెబ్సైట్స్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం 7800 బెట్టింగ్ వెబ్సైట్స్పై కేంద్రం నిషేధం విధించింది. ఆన్ లైన్ గాంబ్లింగ్ వెబ్ సైట్ లతో అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నార.
బెట్టింగ్, ఆన్లైన్ వెబ్ సైట్జకు...
ఇటీవల రియల్ మనీ గేమింగ్ యాప్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బెట్టింగ్, ఆన్లైన్ వెబ్ సైట్ లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ లలో జూదం కారణంగా యువత పెడదోవ పడుతున్నందున చర్యలకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ ను ప్రోత్సహిస్తున్న వెబ్ సైట్ లను గుర్తించి ఈ చర్యలు తీసుకుంది.