బీహార్ లో భారీ పేలుడు .. ఐదుగురి మృతి

బీహార్ జిల్లాలో దారుణం సంభవించింది. భారీ పేలుడు జరిగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2022-03-04 01:35 GMT

బీహార్ జిల్లాలో దారుణం సంభవించింది. భారీ పేలుడు జరిగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో మరో పది మందికి పైగా గాయపడినట్లు తెలిసింది.

పేలుడుకు గల కారణాలు....
బీహార్ లోని తాతార్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజ్వాలీచక్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News