రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ఘటనలో సంచలన విషయాలు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగింది.. కర్ణాటక ముఖ్యమంత్రి

Update: 2024-03-01 14:19 GMT

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగింది బాంబు పేలుడే అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధృవీకరించారు. బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ కేఫ్‌లో జరిగిన పేలుడులో కనీసం తొమ్మిది మంది గాయపడ్డారు. మొదట సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావించారు. అయితే ఐఈడీ వల్ల పేలుడు సంభవించిందని సిద్ధరామయ్య ధృవీకరించారు. ఒక వ్యక్తి కేఫ్ లోపల బ్యాగ్‌ను ఉంచినట్లు చెప్పారు. అనుమానితుడు కేఫ్‌లో అల్పాహారం చేసి, బ్యాగ్‌ని వదిలిపెట్టాడు.

బ్యాగ్‌లో ఉన్న ఐఈడీ మినహా ఆవరణలో ఇంకేమీ కనిపించలేదని పోలీసులు ముఖ్యమంత్రికి తెలిపారు. కేఫ్ లోపల బ్యాగ్ ఉంచిన వ్యక్తి క్యాష్ కౌంటర్ నుంచి టోకెన్ తీసుకున్నాడని కూడా సిద్దరామయ్య తెలిపారు."ఇది పెద్ద ఎత్తున జరిగిన పేలుడు కాదు, ఇది ఊహించని పేలుడు. ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగాయి. ఇటీవలి కాలంలో, ఇటువంటి పేలుళ్లు జరగలేదు. బీజేపీ హయాంలో మంగళూరులో ఇలాంటి పేలుళ్లు జరిగినా.. మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి’’ అని సిద్ధరామయ్య అన్నారు. గాయపడిన వారిలో సిబ్బందితో పాటు ఒక కస్టమర్ కూడా ఉన్నారు. వారి గాయాలు పెద్దగా ఏమీ లేవని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పేలుడులో గాయపడిన తొమ్మిది మందిని హోటల్ సిబ్బంది ఫరూక్ (19), అమెజాన్ ఉద్యోగి దీపాంశు (23), స్వర్ణాంబ (49), మోహన్ (41), నాగశ్రీ (35), మోమి (30), బలరామకృష్ణన్ (31) నవ్య (25), శ్రీనివాస్ (67) గా గుర్తించారు.


Tags:    

Similar News