BJP : తమిళనాడులో పోటీకి దిగనున్న రాధిక.. బీజేపీ అభ్యర్థిగా

సినీ నటి రాధికకు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ఇటీవల శరత్‌ కుమార్‌ తన పార్టీని బీజేపీీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే

Update: 2024-03-22 10:47 GMT

సీనియర్ నటి రాధికకు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ఇటీవల శరత్‌ కుమార్‌ తన పార్టీని బీజేపీీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఎంపీ టికెట్ రాధిక శరత్ కుమార్ కు టిక్కెట్ ఇచ్చింది. విరుధునగర్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. బీజేపీ నాలుగో జాబితాలో తమిళనాడులో పదిహేను మందికి టిక్కెట్లు కేటాయిస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

1. పుదుచ్చేరి - ఏ. నమశివాయం
2. తిరువల్లూర్(ఎస్సీ) - పోన్ వి బాలగణపతి
3. చెన్నై నార్త్ - ఆర్.సి పాల్ కనగరాజ్
4. నమక్కల్ - కే.పీ. రామలింగం
5. తిరుప్పుర్ - ఏ.పీ మురుగనందం
6. పొల్లాచి - కే. వసంతరాజన్
7. కరుర్ - వి.వి సెంతిల్‌నాథన్
8. చిదంబరం (ఎస్సీ) - పి. కాత్యాయిని
9. నాగపట్టినమ్ - ఎస్.జి.ఎం రమేష్
10. తంజావూర్ - ఎం. మురుగనందం
11. శివగంగ - దేవనాథన్ యాదవ్
12. మదురై - ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్
13. విరుధునగర్ - రాధికా శరత్ కుమార్
14. టెన్‌కాశి (ఎస్సీ) - బి. జాన్ పాండియన్
15. తిరువన్నమలై - ఏ. అశ్వద్థామన్


Tags:    

Similar News