రెచ్చిపోతున్న మావోలు.. వంతెన పేల్చివేత

జార్ఖండ్ లో మావోలు రెచ్చిపోతున్నారు. వరుస దాడులు చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా గిరిదిహ్ జిల్లాలో

Update: 2022-01-23 12:41 GMT

జార్ఖండ్ లో మావోలు రెచ్చిపోతున్నారు. వరుస దాడులు చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటున్నారు. తాజాగా గిరిదిహ్ జిల్లాలో డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 2- 2.30 గంటల మధ్య సింద్వారియా పంచాయతీ బరాకర్ నదిపై నిర్మించిన వంతెనను మావోలు డిటోనేటర్ తో పేల్చివేశారు. అంతకుముందే ఓ మొబైల్ టవర్ ను పేల్చేశారు.

వంతెన పేలిపోవడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వంతెనను పేల్చివేసిన అనంతరం నక్సలైట్లు ఓ లేఖను విడుదల చేశారు. అరెస్టైన నక్సలైట్ ప్రశాంత్ బోస్ దంపతులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జనవరి 21 నుంచి 26వ తేదీ వరకు జరిగే ప్రతిఘటన మార్చ్‌ను విజయవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags:    

Similar News