హైదరాబాద్ లో 5జీ సేవలు

Update: 2022-11-11 03:17 GMT

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది రిలయన్స్‌ జియో. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి లాంటి నగరాల్లో ట్రూ-5జీ బీటా సేవలను అందిస్తున్న జియో.. ఇక హైదరాబాద్, బెంగళూరులో కూడా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ సిటీల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు జియో తెలిపింది. జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1 జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందవచ్చని తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి మరియు నాథ్‌ద్వారా అనే ఆరు నగరాల్లో జియో ట్రూ-5G సేవలను ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు బెంగళూరు మరియు హైదరాబాద్‌లకు విస్తరించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం గురువారం ప్రకటించింది. నవంబర్ 10 నుండి జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా, వినియోగదారులకు గరిష్టంగా 1Gbps+ వేగంతో అపరిమిత 5జీ డేటా అందించబడుతుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే ఆరు నగరాల్లో లక్షలాది మంది వినియోగదారులు 5జీ సేవలను పొందుతున్నారు.


Tags:    

Similar News