సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' టీజర్ రిలీజ్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్ 3' టీజర్ రిలీజ్ అయ్యింది.

Update: 2023-09-27 07:08 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), కత్రినా కైఫ్ (Katrina Kaif) ప్రధాన పాత్రల్లో 2012లో ఆడియన్స్ ముందుకు వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏక్ థా టైగర్'. ఈ సినిమాలో సల్మాన్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తే.. కత్రినా కైఫ్ పాకిస్తాన్ గూఢచారిగా నటించింది. ఈ మూవీ అప్పటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా 2017లో 'టైగర్ జిందా హై' అంటూ సీక్వెల్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకురాగా.. అది సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి మూడో భాగం తీసుకు రాబోతున్నారు.

'టైగర్ కా మెసేజ్' అంటూ టైగర్ 3 చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఆ మూవీ మేకర్స్.. సినిమా ప్రమోషన్స్ కి తెరలేపారు. ఈక్రమంలోనే మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్‌లో లవ్ కోసం, సెకండ్ పార్ట్‌లో వైఫ్ కోసం ఫైట్ చేసిన సల్మాన్.. ఈ మూడో భాగంలో కొడుకు కోసం ఫైట్ చేయబోతున్నాడని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఆ టీజర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
Full View
మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని యశ్ రాజ్ ఫిలిమ్స్.. తమ స్పై యూనివర్స్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాకి టైగర్ మూవీతో కనెక్షన్ పెట్టి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశారు నిర్మాతలు. ఈ స్పై యూనివర్స్ లో టైగర్, పఠాన్, వార్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ టైగర్ 3 లో షారుఖ్ ఖాన్.. పఠాన్ గా గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నాడు. దీపావళి కానుకగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. హిందీతో పాటు సౌత్ లాంగ్వేజ్స్ లో కూడా రిలీజ్ కానుంది.


Tags:    

Similar News