తవ్వితే బంగారం.. భలే దొరికింది

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌ జిల్లాలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు.

Update: 2025-08-09 08:45 GMT


మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌ జిల్లాలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు. మహాగ్వాన్‌ కియోలరి ప్రాంతంలో ఏకంగా 100 హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్టు కనిపెట్టారు. ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భాగంగా చేసిన మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని శాస్త్రవేత్తలు జాతీయ మీడియాకు చెప్పారు. ఆ భూముల్లో బంగారంతోపాటు రాగి, మరిన్ని విలువైన లోహాలు కూడా ఉన్నాయి. మహాగ్వాన్‌ కియోలరి ప్రాంతంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇనుము, మాంగనీసు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి వెలికితీసిన ఇనుము, మాంగనీసు, లాటిరైట్‌, సున్నపురాయితోపాటు సిలికా తదితర ఖనిజాలు చైనా సహా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

Tags:    

Similar News