భారతదేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అవ్వనుంది. దేశీయ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశలో భాగంగా చేసిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక - ఎల్ఆర్జీఆర్ 120 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ప్రయోగాన్ని డీఆర్డీవో ఒడిశాలోని చండీపూర్ నుంచి చేపట్టింది. ఈ రాకెట్ గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష విజయవంతమైందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆయన అభినందించారు.