గూగుల్ కు 1337.76 కోట్ల జరిమానా

Update: 2022-10-21 02:01 GMT

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. దీంతో రూ.1337.76 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని గూగుల్ కు సీసీఐ వార్నింగ్ ఇచ్చింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. Android మొబైల్ పరికర పర్యావరణ వ్యవస్థలో బహుళ మార్కెట్‌లలో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు Googleకి జరిమానా విధించింది.

Google Android OS (ఆపరేటింగ్ సిస్టమ్)ని నిర్వహిస్తుంది. స్మార్ట్ ఫోన్ పని చేయాలంటే దానికి ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్) కావాలి. అలాంటి ఓస్ లలో ఆండ్రాయిడ్ ఒకటి. దాన్ని గూగుల్ 2005లో కొనుగోలు చేసింది. మొబైల్ కంపెనీలు దాదాపు ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు ప్లేస్టోర్, గూగుల్ సెర్చ్, గూగుల్ క్రోమ్, య్యూటూబ్ తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగుందని సీసీఐ పేర్కొంది. ఇక వీటి ద్వారా పోటీ వ్యతిరేక పద్దతులను గూగుల్ అవలంభిస్తోందని పేర్కొంటూ గూగుల్ కు జరిమానా విధించింది. గూగుల్ మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (MADA) వంటి హక్కులు, బాధ్యతలను నియంత్రించడానికి బహుళ ఒప్పందాలను కుదుర్చుకుంటారు. "అత్యంత ప్రముఖ సెర్చ్ ఎంట్రీ పాయింట్లు అంటే సెర్చ్ యాప్, విడ్జెట్, క్రోమ్ బ్రౌజర్‌లు ఆండ్రాయిడ్ పరికరాలలో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయని MADA హామీ ఇచ్చింది, ఇది దాని పోటీదారుల కంటే Google సెర్చ్ సేవలకు గణనీయమైన పోటీని ఇచ్చింది" అని CCI ఒక ప్రకటనలో తెలిపింది.


Tags:    

Similar News