హాంకాంగ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో మంటలు

హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315లో మంటలు చెలరేగాయి.

Update: 2025-07-23 10:15 GMT

హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 315లో మంటలు చెలరేగాయి. పవర్ యూనిట్‌లో మంటలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. విమానం ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికి యాక్సిలరీ విద్యుత్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన విమానం ల్యాండ్ అయిన కాసేపటికి పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని ఎయిరిండియా తెలిపింది. ఈ ఘటనలో విమానానికి స్వల్ప నష్టం వాటిల్లిందని, ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా దిగారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది.

Tags:    

Similar News