15 రూపాయలతో మీ ఒంట్లో ఏమి జరుగుతోందో చెప్పేస్తుంది
హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పరిశోధకులు రక్తం, చెమట, మూత్రం, కణాల నుండి జీవక్రియలను ఐదు నిమిషాల్లోపు గుర్తించగల బయోసెన్సర్ను అభివృద్ధి చేశారు.
హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పరిశోధకులు రక్తం, చెమట, మూత్రం, కణాల నుండి జీవక్రియలను ఐదు నిమిషాల్లోపు గుర్తించగల బయోసెన్సర్ను అభివృద్ధి చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఆవిష్కరణ డయాబెటిక్ కార్డియోమయోపతి వంటి విషయాలను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. ఈ పరికరం చెమట, మూత్రం నుండి గ్లూకోజ్, లాక్టేట్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. రీసెర్చ్ స్కాలర్ సోనాల్ ఫండే నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఈ సెన్సార్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే. ముఖ్యంగా సాంప్రదాయ రక్త పరీక్షలకు సూది ఉపయోగం లేకుండా ప్రత్యామ్నాయంగా మారనుంది. ఇది డయాబెటిస్ రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు.