ఫ్యాక్ట్ చెక్: ఖుషి సినిమా షూటింగ్ లో సమంత, విజయ్ దేవరకొండకు గాయాలయ్యాయా..?

విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా సమంత నటిస్తోంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను కశ్మీర్ లో ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ షూటింగును ఈ సినిమా టీమ్ పూర్తిచేసింది. నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

Update: 2022-05-24 09:58 GMT

క్లెయిమ్: ఖుషి సినిమా షూటింగ్ లో సమంత, విజయ్ దేవరకొండకు గాయాలయ్యాయా..?

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు


విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా సమంత నటిస్తోంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను కశ్మీర్ లో ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ షూటింగును ఈ సినిమా టీమ్ పూర్తిచేసింది. నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి కావడంతో హైదరాబాద్‌ చేరుకుంది `ఖుషి` టీమ్‌. చిన్నగ్యాప్‌తో మరో షెడ్యూల్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలోనే హైదరాబాద్ లో మొదలవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు.

"ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండ, సమంతకి గాయాలయ్యాయని.. చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు" అని వార్తలు వచ్చాయి. కశ్మీర్‌లోని పహల్గామ్‌ ప్రాంతంలో స్టంట్‌ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో వారికి గాయాలైనట్టు.. షూటింగ్‌ చేస్తుండగా, వీరిద్దరు లిడర్‌ నదికిరెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చిందట. కానీ దురదృష్టవశాత్తు వాహనం నీటిలో పడిపోవడంతో విజయ్‌, సమంతకి గాయాలయ్యాయని.. వెంటనే స్పందించిన టీమ్‌ స్థానిక ఆసుపత్రికి వీరిని తరలించి చికిత్స అందించారంటూ కథనాలు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు, సమంత అభిమానులు కంగారు పడుతూ ఉన్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వారికి గాయాలైనట్లుగా ఎటువంటి సోషల్ మీడియా పోస్టులు రాలేదు. చిత్ర యూనిట్ కూడా ప్రమాదం జరిగినట్లు ఎటువంటి ప్రకటన చేయలేదు.

వదంతులపై చిత్ర నిర్మాతలు అధికారిక స్టేట్మెంట్ ను విడుదల చేశారు.

ఖుషీ నిర్మాతలు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు.. ఇందులో సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారని వార్తలలో నిజం లేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో 30 రోజుల షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న తర్వాత ఆ బృందం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిందని ప్రకటనలో పేర్కొంది.

"There are few reports that #VijayDeverakonda and #Samantha were injured while shooting for #Kushi movie. There is no truth in this news. The entire team returned to Hyderabad yesterday after successfully completing 30 days of shooting in Kashmir. Don't believe such news". అంటూ స్టేట్మెంట్ ను విడుదల చేశారు.

పలువురు ప్రముఖ సినీ జర్నలిస్టులు కూడా వైరల్ పోస్టుల్లో నిజం లేదని తేల్చేశారు.

ఈ నెల ప్రారంభంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. గుణశేఖర్ స్వయంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

విజయ్ దేవరకొండ 'లైగర్' ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ బాక్సర్‌గా నటించాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య పాండే, మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయ్యాయనే వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.


క్లెయిమ్: విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయ్యాయి

క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు, కొన్ని మీడియా సంస్థలు

ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Samantha Ruth Prabhu, Vijay Deverakonda injured on Kushi sets
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News