నిజ నిర్ధారణ: మునుగోడు ఉప ఎన్నికపై ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వే చేయలేదు, ఇది బూటక వార్త.

మునుగోడు ఉప ఎన్నికపై హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు - టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నవంబర్ 3, 2022న ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2022-11-03 10:25 GMT

మునుగోడు ఉప ఎన్నికపై హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు - టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, విజయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నవంబర్ 3, 2022న ఎన్నికలు జరుగుతున్నాయి.

దీనికి సంబంధించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చేసిన సర్వే అంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో మునుగోడులో బీజేపీ టీఅరెస్ చేతిలో 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోతుందని ఆరెస్సెస్ స్వయంగా తన సర్వేలో ప్రకటించిందని ఉంది. సర్వే ప్రకారం: టీఆర్ఎస్ - 99,170 బీజేపీ - 62,630 కాంగ్రెస్ - 31,770.

వైరల్ చిత్రంల్ ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ కార్యదర్శి కాచం రమేష్‌కి హిందీలో లేఖ రాసినట్టు ఉంది. 2022లో జరిగే మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన సర్వే రిపోర్టు లేఖలోని అంశం. అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు రహస్య సర్వే నిర్వహించామని.. ఒక్కో పార్టీ ఓట్ల లెక్కింపును సర్వేలో చూపుతోంది. సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 99,170, బీజేపీకి 62,630, కాంగ్రెస్‌కు 31,770 స్థానాలు దక్కనున్నాయి.



Full View


Full View


Full View

నిజ నిర్ధారణ:

చిత్రం ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన సర్వే ఫలితాలను చూపుతుందనే వాదన అవాస్తవం. మునుగోడు ఉపఎన్నికపై ఆర్‌ఎస్‌ఎస్ ఎలాంటి సర్వే నిర్వహించలేదు.

ఈ వాదనను ఖండిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 'ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే నివేదిక' పేరుతో నకిలీ ప్రకటన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అందులో పేర్కొంది.

ఈ ప్రకటన ప్రకారం, మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో విడుదల చేసిన ఈ నివేదికపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సంతకం చేసి, ప్రజలను గందరగోళపరిచే, తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో విడుదల చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అటువంటి సర్వే నిర్వహించలేదని, ఈ నకిలీ పత్రాన్ని ప్రచారం చేసే దుర్మార్గపు చర్యను ఖండిస్తున్నామని వారు తెలిపారు.

ఇంకా ప్రకటనలో ఇలా ఉంది, ఆర్‌ఎస్‌ఎస్ గత 97 సంవత్సరాలుగా వ్యక్తిగత లక్షణాన్ని నిర్మించడం ద్వారా దేశాన్ని నిర్మించాలనే ప్రాథమిక లక్ష్యంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా రాజకీయాలలో పాల్గొనదు లేదా రాజకీయ సర్వేలు నిర్వహించదు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో కీలకమైన భాగం కాబట్టి, ప్రతి భారతీయ పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సహిస్తుంది.

ఈరోజుల్లో, రాజకీయ ప్రయోజనాల కోసం నకిలీ, నిరాధారమైన, అసంబద్ధమైన వార్తా కథనాలు, వ్యాఖ్యలను ఆశ్రయిస్తున్న వ్యక్తులు ఆరెసెస్ వంటి సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థను కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకమైన చర్యలు ఏ వ్యక్తి లేదా బాధ్యత గల సంస్థ స్థానానికి తగినవి కావు. ఇది ప్రజాస్వామ్య, సామాజిక విలువలను అవహేళన చేయడం, దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు.

అటువంటి నకిలీ పత్రాలు, వాటి నుండి వెలువడే వార్తలకు కారణమైన వ్యక్తులను గుర్తించి, వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని మరియు అధికారులను అభ్యర్థిస్తున్నాము.

కాచం రమేష్

ప్రాంత్ కార్యవహ్, ఆర్‌ఎస్‌ఎస్, తెలంగాణ

https://vskbharat.com/identify-the-persons-responsible-for-fake-documents-press-statement-by-rss-telangana/?lang=en

కొన్ని వార్తా వెబ్‌సైట్‌లు, తెలుగు టీవీ ఛానెల్‌లు కూడా చిత్రం డాక్టరేడ్ అని మరియు ఆరెసెస్ నిర్వహించిన సర్వే నివేదికను చూపడం లేదని నివేదించాయి.

https://myindmedia.com/false-propaganda-of-rss-survey-on-munugodu-condemned-organization/

Full View

Full View

కనుక, మునుగోడు ఉపఎన్నికపై ఆర్‌ఎస్‌ఎస్ సర్వే రిపోర్టును వైరల్ ఇమేజ్ చూపిందన్న వాదన అవాస్తవం.

Claim :  RSS survey on Munugode bypolls shows TRS win
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News