నిజ నిర్ధారణ: భారతదేశం జి 20లో ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉంది

2023 సంవత్సరానికి జి 20 సదస్సుకు అధ్యక్షత వహించనున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు అభినందనలు తెలిపిన వీడియో వైరల్‌గా షేర్ అవుతోంది, 'ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురైయ్యే భారతదేశం వచ్చే ఏడాది సమ్మిట్‌కు అధ్యక్ష పదవిని పొందిందీ అంటూ క్లెయిం తో ఈ వీడియో షేర్ అవుతోంది.

Update: 2022-11-22 09:05 GMT

2023 సంవత్సరానికి జి 20 సదస్సుకు అధ్యక్షత వహించనున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు అభినందనలు తెలిపిన వీడియో వైరల్‌గా షేర్ అవుతోంది, 'ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురైయ్యే భారతదేశం వచ్చే ఏడాది సమ్మిట్‌కు అధ్యక్ష పదవిని పొందిందీ అంటూ క్లెయిం తో ఈ వీడియో షేర్ అవుతోంది.

తెలుగులో క్లెయిమ్ ఇలా స్సగుతోంది " జి 20 సదస్సులో ఒకసారి ఓ మూలన కూర్చోబెట్టిన మన దేశాన్ని ఇప్పుడు ఏకంగా సదస్సుకు అధ్యక్షత వహించే స్థానం ఇచ్చారంటే ఇది కదా దేశ గౌరవం కాపాడటం అంటే"

Full View


Full View


Full View

నిజ నిర్ధారణ:

జి20 సదస్సులో భారత్ ఎప్పుడూ క్రియాశీలకంగా లేదన్న వాదన తప్పుదారి పట్టిస్తోంది.

జి-20 లేదా గ్రూప్ ఆఫ్ ట్వంటీ అనేది సభ్య దేశాల మధ్య ఆర్థిక లావాదేవీల వంటి అత్యంత ముఖ్యమైన అంశాలపై అంతర్జాతీయ సహకారం కోసం ప్రధాన వేదిక. 1990లలో అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా ఈ దేశాలలో కొన్ని ప్రపంచ ఆర్థిక చర్చ, పాలనలో తగినంతగా ప్రాతినిధ్యం వహించలేదని గుర్తించిన తర్వాత జి-20 సృష్టించబడింది.

డిసెంబర్ 1999లో, ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే కీలక సమస్యలపై అనధికారిక సంభాషణ కోసం జర్మనీలోని బెర్లిన్‌లో అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు మొదటిసారి సమావేశమయ్యారు. అప్పటి నుండి, ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు ఏటా సమావేశమవుతారు. భారతదేశం 2002లో ఘ్20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశాన్ని నిర్వహించింది. 2008లో, ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక మరియు ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఘ్20ని శిఖరాగ్ర స్థాయికి పెంచారు.

ఇప్పటి వరకు ఏడు జి20 సదస్సులు జరిగాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందనను అభివృద్ధి చేయడానికి నవంబర్ 2008లో ఊశ్ అధ్యక్షుడు వాషింగ్టన్‌లో మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.

https://www.mea.gov.in/Portal/ForeignRelation/g20-august-2012.pdf

జి20 అధ్యక్ష పదవి ప్రతి సంవత్సరం ఒక్కో దేశం ప్రాతినిత్యం వహిస్తుంది. అధ్యక్ష పదవిని కలిగి ఉన్న దేశం, ఎజెండా కొనసాగింపును నిర్ధారించడానికి ఇంతకు ముందు సంవత్సరం ఉన్న దేశం, అలాగే మరుసటి సంవత్సరం ఉండే దేశం తో కలిసి పని చేస్తుంది, దీనిని ట్రోయికా అని కూడా పిలుస్తారు.

జి20కి శాశ్వత సెక్రటేరియట్ లేదు. ఎజెండా, పని సమన్వయం జి20 నాయకుల వ్యక్తిగత ప్రతినిధులు, షెర్పాస్ అని పిలుస్తారు, ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌ల గవర్నర్‌లతో కలిసి పూర్తి చేస్తారు.

https://www.g20.org/about-the-g20/

2022లో జరిగే జి20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహించాల్సి ఉంది, అయితే భారతదేశం, ఇండోనేషియా జి20 అధ్యక్ష పదవీకాలాన్ని పరస్పరం మార్చుకున్నాయి. ఈ మార్పుకు అధికారిక కారణం అందుబాటులో లేనప్పటికీ, ఈ నిర్ణయం ఏకాభిప్రాయంతో తీసుకున్నట్టు తెలుస్తోంది.

https://www.hindustantimes.com/world-news/india-indonesia-swap-g20-presidency-term-new-delhi-to-chair-grouping-in-2023/story-JaQdBkxBXrs5XWxliIwQWM.html

భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16, 2022న భారత ఘ్20 అధ్యక్ష పదవికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. వివరాలను ఇక్కడ లింక్‌లో చూడవచ్చు.

https://www.pmindia.gov.in/en/news_updates/unveiling-of-the-logo-theme-and-website-of-indias-g20-presidency/

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఘ్20 వార్షిక అపెక్స్-లెవల్ సమ్మిట్‌గా పునర్నిర్మించబడినప్పటి నుండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు నాలుగు సందర్భాలలో మాత్రమే దీనికి అధ్యక్షత వహించాయి - 2012లో మెక్సికో, 2016లో చైనా, 2018లో అర్జెంటీనా, మరియు ఇప్పుడు, 2022లో ఇండోనేషియా. భారతదేశ అధ్యక్ష పదవి అటువంటి ఐదవ సందర్భాన్ని సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చారిత్రాత్మకంగా, డిసెంబర్ 1 తర్వాత జి20 త్రయం గతం, ఇన్‌కమింగ్ మరియు తదుపరి ఘ్20 ప్రెసిడెన్సీలను కలిగి ఉంటుంది, అంటే ఇండోనేషియా, భారతదేశం, బ్రెజిల్.

కనుక, భారతదేశం ఎల్లప్పుడూ జి20లో భాగస్వామ్యదేశంగా, క్రియాశీలకంగానే ఉంది. క్లెయిం తప్పుదారి పట్టించేది.

Claim :  India which was always in corner at G20, now got the presidency
Claimed By :  Facebook Users
Fact Check :  Misleading
Tags:    

Similar News