ఆధార్‌ మోసాలు.. మీ బయోమెట్రిక్‌ను లాక్‌ చేయడం ఎలా?

ఈ రోజుల్లో ఆధార్‌ మోసాలు రోజరోజుకు పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిలువునా మోసపోవాల్సిన పరిస్థితి ..

Update: 2023-10-27 04:24 GMT

ఈ రోజుల్లో ఆధార్‌ మోసాలు రోజరోజుకు పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిలువునా మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పోలీసులు, బ్యాంకు అధికారులు, టెక్‌ నిపుణులు పదేపదే చెబుతున్న మాట ఏంటంటే సైబర్‌ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని. ఇక ముఖ్యమైన పత్రాలలో అధార్‌ ఒకటి. దీని వల్ల ఎన్నో పనులు జరుగుతుంటాయి. ఈ ఆధార్‌ లేనిది ఏ పని చేసుకునేందుకు వీలుండగా, పిల్లలను స్కూల్‌లో చేర్పించడం నుంచి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పథకాలతో పాటు చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆధార్‌ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఇక ఇప్పుడున్న కాలంలో ఆర్థిక మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత డెవలప్‌ అవుతుంటే అంత మోసాలు పెరుగుతున్నాయి. ఆధార్‌ కార్డు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మీ ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ అయ్యే పరిస్థితి రావచ్చు. ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆధార్‌ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతూ బ్యాంకులో ఉన్న డబ్బంతా కొల్లగొడుతున్నారు. మరి ఆధార్‌ బయోమోట్రిక్‌ను లాక్‌ చేసుకోవడం ద్వారా మోసాల నుంచి రక్షించుకోవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) వల్ల చాలా మంది ఆధార్ కార్డు వినియోగదారులు వేల రూపాయలు కోల్పోయే ప్రమాదం ఉందని వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన జ్యోతి రామలింగయ్య ఇటీవల లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. ఏఈపీఎస్‌ వ్యవస్థ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, ఓటీపీ వంటి బహుళ-దశల ధృవీకరణ అవసరమయ్యే ఇతర ఆన్‌లైన్ సేవల వలె కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి లావాదేవీకి ఓటీపీ అవసరం లేదు. దీనికి ఆధార్ నంబర్, వేలిముద్ర, ఓటీపీ, ఐరిస్ అవసరం. ఇది గొప్ప ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఇది అనధికార ఆర్థిక లావాదేవీలకు దారి తీస్తుంది.

ఈ వ్యవస్థ వల్ల రూ.10,000 నష్టపోయానని లింక్డ్‌ఇన్‌లో రామలింగయ్య చెప్పుకొచ్చారు. బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చిన తర్వాత లావాదేవీని ప్రామాణీకరించడానికి తన ఆధార్ కార్డ్ ఉపయోగించబడిందని అతను చెప్పాడు. అందుకే మీరు mAadhaar యాప్ ద్వారా మీ ఆధార్ కార్డ్‌లో బయోమెట్రిక్‌ను లాక్ చేస్తే మీరు సురక్షితంగా ఉండవచ్చు. ఈ యాప్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా UIDAI మొబైల్ యాప్. ఇది మీ ఆధార్ సమాచారానికి అదనపు భద్రతను జోడించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఎందుకంటే ఇందులో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు మొదలైన వాటితో సహా మీ బయోమెట్రిక్ డేటా ఉంటుంది.

టెక్నాలజీ ప్రపంచంలో మన చిన్న పొరపాటు, చిన్నపాటి అజాగ్రత్త ఒక్క క్లిక్‌లో పెను ప్రమాదంగా మారుతుంది. ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవడానికి, అన్నింటికంటే మించి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచడానికి మీరు ఈ కొన్ని పనులు చేయాలి.

ఆధార్‌ బయోమెట్రిక్‌ను లాక్‌ చేసుకోవడం ఎలా?

➦ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

➦ యాప్ పైన కుడివైపున ఉన్న 'రిజిస్టర్ మై ఆధార్' బటన్‌పై నొక్కండి.

➦ ఇప్పుడు యాప్ కోసం 4 అంకెల పాస్‌వర్డ్‌ను సృష్టించండి.

➦ ఇప్పుడు మీరు ఆధార్ నంబర్, సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది.

➦ ఇప్పుడు మీరు OTPని ఎంటర్‌ చేయాలి. అది మీ ఆధార్‌తో లింక్ చేయబడిన నంబర్‌కు పంపబడుతుంది. ఫోన్ ఎస్‌ఎంఎస్‌ యాప్‌ని తనిఖీ చేసి, ఆ OTPని నమోదు చేయండి.

➦ OTP అందించిన తర్వాత మీ ఖాతా అన్‌లాక్ చేయబడుతుంది. కిందికి స్క్రోల్ చేసి, 'బయోమెట్రిక్ లాక్' ఎంపికపై నొక్కండి.

➦ ఇప్పుడు లాక్ బయోమెట్రిక్స్‌పై నొక్కండి.

➦ మళ్లీ మీరు సెక్యూరిటీ క్యాప్చా, ఓటీపీని నమోదు చేయాలి.

➦ఒకసారి ధృవీకరించబడిన తర్వాత మీ బయోమెట్రిక్ లాక్ చేయబడుతుంది.

Tags:    

Similar News