ఫుల్ ఖుషీగా 'వంగ‌వీటి' అభిమానులు.. ఎందుకంటే..

వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగ‌నున్నాయ‌నే వార్త‌లు నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి.

Update: 2023-08-16 07:44 GMT

వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగ‌నున్నాయ‌నే వార్త‌లు నెట్టింట‌ వైర‌ల్ అవుతున్నాయి. దివంగ‌త మోహన రంగా త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే రాధా మ‌రికొద్ది రోజుల్లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారనేది వార్త‌ల సారాంశం. న‌ర్సాపురానికి చెందిన రాజ‌కీయ నాయ‌కుడి కూతురితో ఆయ‌న వివాహం నిశ్చ‌య‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు ఈ నెల 19న నర్సాపురంలో నిశ్చితార్థం.. వ‌చ్చే నెల 6వ తేదీన వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్లు వైర‌ల్ అవుతున్న వార్త‌ల ద్వారా తెలుస్తోంది. రాధా పెళ్లి వార్తల‌పై వంగవీటి అభిమానులు మాత్రం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వైర‌ల్ అవుతున్న‌ వార్త‌ల‌లో వాస్త‌వ‌మెంతో తెలియాల్సివుంది.

1968లో జ‌న్మించిన‌ వంగవీటి రాధా.. 2004లో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌ను వీడిన రాధా.. ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యం నుంచి పోటీచేసి 2009లో ఓట‌మి పాల‌య్యారు. అప్ప‌టి నుంచి రాధా రాజ‌కీయాల‌లోనే ఉన్నారు. అయితే.. మ‌రోసారి అసెంబ్లీలో మాత్రం అడుగుపెట్ట‌లేక‌పోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని చూస్తున్న రాధా.. ప్ర‌స్తుతం తెలుగు దేశంలో ఉన్నా.. జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. వీట‌న్నింటికి చెక్ ప‌డాలంటే రాధా స్పందించాల్సిందే.




Tags:    

Similar News