బాబు ఏడ్వడంపై పవన్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆవేదన కల్గిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Update: 2021-11-19 12:54 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆవేదన కల్గిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఒకవైపు వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే పార్టీ నేతలు మాత్రం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారని పవన్ కల్క్ష్యాణ్ అన్నారు. క్లిష్ట సమయాల్లోనూ రాజకీయాలేంటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

వారిని కాపాడండి....
రాజకీయాలు మాని ప్రభుత్వం వరద ప్రాంతాల్లో అల్లాడి పోతున్న ప్రజలను కాపాడాలని పవన్ కోరారు. ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించాలని పవన్ కోరారు. అంతేతప్ప విమర్శలు చేయడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News