Jogi Ramesh : జోగి రమేష్ పై మరో కేసు

మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదయింది

Update: 2026-03-27 03:18 GMT

మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదయింది. మాజీమంత్రి జోగి రమేష్‌కు పోటీసులు నోటీసులు ఇచ్చారు. జోగి రమేష్‌కు భట్టిప్రోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు జారీ చేశారు. వారంలోగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసులలో పేర్కొన్నారు.

చంద్రబాబును దూషించిన కేసులో...
బాపట్ల జిల్లా, భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో జోగి రమేష్ ఇంటికి వచ్చి భట్టిప్రోలు పోలీసులు నోటీసులు అందజేశారు. తనపై చంద్రబాబు నాయుడు, లోకేష్ లు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని జోగి రమేష్ ఈ సందర్భంగా విమర్శలు చేశారు.


Tags:    

Similar News