పవన్ అమరావతి పర్యటన వాయిదా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి పర్యటన వాయిదా పడింది.

Update: 2022-01-08 05:48 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి పర్యటన వాయిదా పడింది. కోవిడ్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా తన అమరావతి పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన మండల స్థాయి నేతలతో పవన్ కల్యాణ్ రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కోవిడ్ కేసుల....
పార్టీ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో జనసైనికుల ఆరోగ్యం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ ఈ సమావేశాన్ని వాయిదా వేశారు.


Tags:    

Similar News