ఏపీలో స్థిరంగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 148 కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2021-12-16 11:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 148 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,75,419 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,474 మంది మరణించారు.

కోలుకున్న వారిసంఖ్య....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,59,131 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 1,814 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,08,95,748 నమూనాలను పరీక్షించారు.


Tags:    

Similar News