ఏపీ లో నేడు కరోనా కేసులు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 186 కొత్త కేసులు నమోదయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 186 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,73,576 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,448 మంది మరణించారు.
పరీక్షలు...
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,56,979 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గాయి. 2,149 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,05,39,041 నమూనాలను పరీక్షించారు